మీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి: జయాబచ్చన్

ABN , First Publish Date - 2021-12-20T23:08:32+05:30 IST

న్యూఢిల్లీ: పనామా పేపర్స్ లీక్ కేసులో బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ ఈడీ విచారణకు హాజరైన అంశాన్ని కొందరు సభ్యులు ప్రస్తావించడంపై ఆమె అత్త సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్

మీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి: జయాబచ్చన్

న్యూఢిల్లీ: పనామా పేపర్స్ లీక్ కేసులో బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ ఈడీ విచారణకు హాజరైన అంశాన్ని కొందరు సభ్యులు ప్రస్తావించడంపై ఆమె అత్త సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ రాజ్యసభలో మండిపడ్డారు. తమ కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించి తమ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయని ఆమె హెచ్చరించారు. తమ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని జయాబచ్చన్ డిమాండ్ చేశారు. మరోవైపు ఐశ్వర్యారాయ్‌ను ఈడీ అధికారులు గంటల తరబడి ప్రశ్నించారు.   

Updated Date - 2021-12-20T23:08:32+05:30 IST