ప్రీపెయిడ్ ప్లాన్లను సవరించిన Airtel

ABN , First Publish Date - 2021-07-29T00:05:12+05:30 IST

ప్రీపెయిడ్ ప్లాన్లను సవరించిన Airtel

ప్రీపెయిడ్ ప్లాన్లను సవరించిన Airtel

హైదరాబాద్: ప్రముఖ కమ్యూనికేషన్ సంస్థ భారతి ఎయిర్‌టెల్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. వినియోగదారుల కోసం ప్రీపెయిడ్ ప్లాన్లను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ఎయిర్‌టెల్ పేర్కొంది. కమ్యూనికేషన్ సొల్యూషన్స్ ప్రొవైడర్ భారతి ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్లను సవరించినట్లు ప్రకటించింది. రూ.49 ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ రీఛార్జిని నిలిపివేసింది. కంపెనీ ప్రీపెయిడ్ ప్యాక్‌లు ఇప్పుడు రూ .79 స్మార్ట్ రీఛార్జ్ నుంచి ప్రారంభమవుతాయని, మరియు డబుల్ డేటాతో పాటు వినియోగదారులకు నాలుగు రెట్లు ఎక్కువ అవుట్‌గోయింగ్ నిమిషాలను ఉపయోగించుకోవచ్చు. ఎంట్రీ లెవల్ రీఛార్జ్‌లో ఉన్న ఎయిర్‌టెల్ కస్టమర్లు తమ ఖాతా బ్యాలెన్స్ గురించి చింతించకుండా కనెక్ట్ అయి ఉండొచ్చని సంస్థ పేర్కొంది. సవరించిన ప్లాన్స్ జూలై 29, 2021 నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ తెలిపింది.

Updated Date - 2021-07-29T00:05:12+05:30 IST