కస్టమర్లకు Airtel తీపికబురు
ABN , First Publish Date - 2021-07-22T23:23:49+05:30 IST
కస్టమర్లకు Airtel తీపికబురు
న్యూఢిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ భారతీఎయిర్టెల్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. ఎయిర్టెల్ పోస్ట్పెయిడ్ ప్లాన్లను భారీ డేటా ప్రయోజనాలతో సవరించినట్లు సంస్థ పేర్కొంది. కొత్త కార్పొరేట్ ప్లాన్లను అందుబాటులోకి తెస్తున్నట్లు ఎయిర్ టెల్ పేర్కొంది. ఎయిర్టెల్ ఫ్యామిలీ పోస్ట్పెయిడ్ ప్లాన్ రూ. 999ను సవరించి మొత్తం మూడు కనెక్షన్లతో 210 జీబీ వరకు డేటాను ఉపయోగించుకోవచ్చని సంస్థ పేర్కొంది. రిటైల్ మరియు కార్పొరేట్ కస్టమర్ల కోసం ఎయిర్టెల్ తన పోస్ట్పెయిడ్ ప్రణాళికలను సవరించింది. ఎయిర్టెల్ కార్పొరేట్ పోస్ట్పెయిడ్ ప్రారంభ ప్లాన్ రూ. 299 నుంచి మొదలవుతోందని సంస్థ వెల్లడించింది.