ఎయిర్టెల్ కూడా పొడిగించింది
ABN , First Publish Date - 2020-03-31T03:33:11+05:30 IST
దేశంలోని అతిపెద్ద టెలికం సంస్థల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ కూడా బీఎస్ఎన్ఎల్
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద టెలికం సంస్థల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ కూడా బీఎస్ఎన్ఎల్ బాటలోనే నడిచింది. దేశవ్యాప్తంగా తమకు ఉన్న 80 మిలియన్ల మంది ప్రీపెయిడ్ ఖాతాదారుల వ్యాలిడిటీ గడువును వచ్చే నెల 17 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. వీరందరూ ప్రకటించిన గడువు వరకు నిరంతరాయంగా ఇన్కమింగ్ కాల్స్ అందుకోవచ్చని తెలిపింది. దీంతో పాటు పది రూపాయల టాక్టైమ్ను అందించనున్నట్టు వివరించింది. ప్రస్తుత క్లిష్ట సమయంలో కాల్స్ చేసుకునేందుకు, ఎస్సెమ్మెస్లు పంపుకోవడానికి ఈ టాక్టైమ్ ఉపయోగపడుతుందని తెలిపింది. వచ్చే 48 గంటల్లో ఈ ప్రయోజనాలు ఖాతాదారులకు అందుతాయని పేర్కొంది. కాగా, ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే తమ ప్రీపెయిడ్ ఖాతాదారుల కాలపరిమితిని ఏప్రిల్ 20 వరకు పెంచింది.