రూ. 99, రూ. 129, రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్లను విస్తరించిన ఎయిర్‌టెల్

ABN , First Publish Date - 2020-07-11T23:25:00+05:30 IST

ఎయిర్‌టెల్ తన అతి తక్కువ ప్రీపెయిడ్ ప్లాన్లను మరిన్ని సర్కిళ్లకు విస్తరించింది. రూ. 99. రూ. 129, రూ. 199

రూ. 99, రూ. 129, రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్లను విస్తరించిన ఎయిర్‌టెల్

న్యూఢిల్లీ: ఎయిర్‌టెల్ తన అతి తక్కువ ప్రీపెయిడ్ ప్లాన్లను మరిన్ని సర్కిళ్లకు విస్తరించింది. రూ. 99. రూ. 129, రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్లు ఇప్పటి వరకు కొన్ని సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు మరిన్ని సర్కిళ్లకు విస్తరించింది. రూ. 99 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పటి వరకు కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, యూపీ ఈస్ట్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడీ ప్లాన్‌ను బీహార్, ఝార్ఖండ్, ఒడిశా సర్కిళ్లకు విస్తరించింది. 

 

అలాగే, రూ. 129, రూ. 199 ప్లాన్లను ఢిల్లీ ఎన్‌సీఆర్, అసోం, బీహార్, ఝార్ఖండ్, ముంబై, నార్త్ ఈస్ట్, ఒడిశా రాష్ట్రాల ప్రీపెయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఈ ప్లాన్లు గుజరాత్, హర్యానా, కేరళ, కోల్‌కతా, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గోవా, రాజస్థాన్, యూపీ ఈస్ట్, యూపీ వెస్ట్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్‌ సర్కిళ్లలోని ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ఈ మూడు ప్లాన్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై, హిమాచల్ ప్రదేశ్ జమ్మూకశ్మీర్, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు సర్కిళ్లలో మాత్రం అందుబాటులో ఉండవని ఎయిర్‌టెల్ పేర్కొంది. 

Updated Date - 2020-07-11T23:25:00+05:30 IST