ఎయిర్పోర్ట్లో విదేశీ కరెన్సీ పట్టివేత
ABN , First Publish Date - 2020-12-02T04:56:08+05:30 IST
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న విదేశీ కరెన్సీని మంగళవారం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
శంషాబాద్రూరల్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న విదేశీ కరెన్సీని మంగళవారం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి దుబాయ్ వెళ్తున్న మహ్మద్ హమీద్, మహ్మద్ ఫెరోజ్ డిపార్చర్లోకి వెళ్లగానే అనుమానా స్పదంగా కనిపించారు. సీఐఎస్ఎఫ్ సిబ్బంది వారి బ్యాగు లను తనిఖీ చేయగా ఫెరోజ్ వద్ద 60వేల డాలర్లు, హమీద్ వద్ద 60వేల రియాల్స్ దొరికాయి. దీంతో నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు అధికారులు తెలి పారు. నిందితుల వద్ద పట్టుకున్న రూ.1.2 కోట్ల విలువైన (ఇండియన్ కరెన్సీ) నగదును సీజ్ చేసినట్లు అధికారులు తెలి పారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.