కలెక్టర్‌ను కలిసిన వాయుసేన బృందం

ABN , First Publish Date - 2022-06-30T05:43:18+05:30 IST

కలెక్టర్‌ను కలిసిన వాయుసేన బృందం

కలెక్టర్‌ను కలిసిన వాయుసేన బృందం

ములుగు కలెక్టరేట్‌, జూన్‌ 29: భారత రక్షణ శాఖ వైమానిక దళం వింగ్‌ కమాండర్‌ సజ్జా చైతన్య బర్తీ ఆధ్వర్యంలో బృందం సభ్యులు కలెక్టర్‌ ఎస్‌.కృష్ణఆదిత్యను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కలెక్టర్‌కు డైరీని బహూకరించారు. అనంతరం అగ్నిపథ్‌ పథకంలో భాగంగా భారత వాయుసేనలో నియామకాల ప్రక్రియపై ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె.రమాదేవి, కలెక్టరేట్‌ ఏవో విజయభాస్కర్‌, జిల్లా యువజన సర్వీసుల శాఖ అధికారి పి.వెంకటరమణాచారి, డీఈవో పాణిని, ఎంప్లాయీమెంట్‌ అధికారి కుమారస్వామి పాల్గొన్నారు.

Updated Date - 2022-06-30T05:43:18+05:30 IST