ఇప్పుడు సాధారణంగానే నడుస్తున్నాయి... ఎయిర్లైన్స్
ABN , First Publish Date - 2022-05-26T00:27:38+05:30 IST
జీవ ఇంధనాలను వినియోగించాల్సిన క్రమంలో ASTM ఆమోదం కోసం భారత విమానయానరంగం ఎదురుచూస్తోంది.
న్యూఢిల్లీ : జీవ ఇంధనాలను వినియోగించాల్సిన క్రమంలో ASTM ఆమోదం కోసం భారత విమానయానరంగం ఎదురుచూస్తోంది. కాగా... త్వరలోనే ఆమోదం రానున్నట్లు ఎయిర్లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. నిన్న(మంగళవారం) విమానయాన సంస్థలు ఎదుర్కొన్న ransomware దాడి తర్వాత బుధవారం ఉదయం స్పైస్జెట్ విమానాలు బయలుదేరడంపై ప్రభావం పడింది. ఈ క్రమంలో... ఒక ట్వీట్లో, ఎయిర్లైన్స్... ‘కొన్ని స్పైస్జెట్ సిస్టమ్లు గత రాత్రి ransomware దాడిని ఎదుర్కొన్నాయి, అది ప్రభావం చూపడంతోపాటు ఈ రోజు ఉదయం విమానాల బయలుదేరే వేగాన్ని తగ్గించింది. మా ఐటీ బృందం పరిస్థితిని సరిదిద్దింది. ఈ క్రమంలో... ఇప్పుడు విమానాలు సాధారణంగా నడుస్తున్నాయి’ అని పేర్కొంది.