ఎయిరిండియా... ఈ నెల 27 న టాటాలకు...
ABN , First Publish Date - 2022-01-25T01:49:57+05:30 IST
భారత విమానయాన సంస్థ ఎయిరిండియా... ఈ నెల 27 న టాటాల చేతుల్లోకి వెళ్ళనుంది.
న్యూఢిల్లీ : భారత విమానయాన సంస్థ ఎయిరిండియా... ఈ నెల 27 న టాటాల చేతుల్లోకి వెళ్ళనుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ క్రమంలో... ఎయిరిండియా ముగింపు బ్యాలెన్స్ షీట్... ఈ నెల 24 న అందించనున్నారు. అంటే... దీనిపై సమీక్షించుకునేందుకు ఎయిరిండియాకు మూడు రోజుల సమయముంటుంది. కాగా... ఇతరత్రా మార్పులకు సంబంధించిన సూచనలు, అభిప్రాయాలను అందించేందుకు టాటా గ్రూపునకు మూడు రోజుల సమయముంటుంది. ఇక సంస్థ అప్పగింత విషయమై... ఉద్యోగులకు ట్విట్టర్లో వెల్లడించారు.