ఎయిరిండియా ఇండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఏషియా ఇండియా విలీనం ?
ABN , First Publish Date - 2021-11-29T22:39:56+05:30 IST
ఎయిరిండియా ఇండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఏషియా ఇండియా విలీనం కానున్నాయా ? టాటా సన్స్ ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకుందా ? ఈ ప్రశ్నలకు ‘అవును’ అన్న సమాధానమే వినవస్తోంది.
ముంబై : ఎయిరిండియా ఇండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఏషియా ఇండియా విలీనం కానున్నాయా ? టాటా సన్స్ ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకుందా ? ఈ ప్రశ్నలకు ‘అవును’ అన్న సమాధానమే వినవస్తోంది. ఎయిరిండియాను ఇటీవలే దక్కించుకున్న టాటా గ్రూప్... ఇప్పటికే ఎయిర్ ఏసియాలో 84 శాతం, విస్తారాలో 51 శాతం వాటాలను కలిగి ఉంది. ఎయిరిండియా, దాని అనుబంధ సంస్థ అయిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్లో వంద శాతం వాటాను కొద్ది రోజుల క్రితం టాటా సన్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎయిరిండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఏషఫియా ఇండియా విషయంలో టాటా సన్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వినవస్తోంది.
ఎయిర్ ఇండియా, దాని అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లలో... ఈ మధ్యే వంద శాతం వాటా కొనుగోలు చేసిన టాటా సన్స్... విమానయాన రంగంలో తన సత్తాను చాటేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే తన వాటాలున్న ఎయిర్ ఏషియా, విస్తారాలను కూడా లాభాల బాటలో నడిపించేందుకు యత్నిస్తోంది. ఎయిర్ ఇండియా ఈ ఏడాది ఆఖరుకు టాటా సన్స్ ఆధీనంలోకి రానుంది. ఎయిర్ ఏసియాలో 84 శాతం, విస్తారాలో 51 శాతం వాటాలు ఈ గ్రూపునకు ఉన్నాయి. ఈ నేపధ్యంలో చౌక విమానయాన సంస్థ అయిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ను, ఎయిర్ ఏషియా ఇండియాను విలీనం చేయాలని టాటా సన్స్ యోచిస్తోంది. ఎయిర్ ఇండియా బడ్జెట్ క్యారియర్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ను ఎయిర్ ఆసియా ఇండియాతో విలీనం చేయాలని టాటా సన్స్ చూస్తున్నట్లు ఉన్నతాధికారులు పనేర్కొంటున్నారు.
అలాగే... విస్తారా షెడ్యూళ్లను క్రమబద్దీకరించే విషయంలో భాగస్వామ్య సంస్థ సింగపూర్ ఎయిర్లైన్స్తో టాటాసన్స్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. టాటా సన్స్ గ్రూప్ పరిధిలోని విమానయాన కార్యకలాపాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చినపక్షంలో... ఇబ్బందులు తగ్గడంతోపాటు, వ్యయాలు కలిసివస్తాయని భావిస్తున్నారు. తమ పరిధిలోని ఈ సంస్థల సిబ్బందిని సమన్వయం చేసుకోవడం, నాణ్యత-భద్రతా పరీక్షల వంటి అంశాల్లో ఐక్యత సాధించేందుకు ఆయా సంస్థల ఉన్నతాధికారులతో టాటా సన్స్ ఇప్పటికే చర్చలు జరిపింది. మరోవైపు... టాటా గ్రూపు ఎయిర్ ఇండియాను స్వాధీనం చేసుకునే సమయం దగ్గర పడుతుండడంతో కార్యాచరణ వ్యయాలను తగ్గించుకునే దిశగా కూడా ఇప్పటికే సన్నాహాలు చేసుకుంటున్నట్లు వినవస్తోంది. విస్తారా, ఎయిర్ ఇండియాను కలిపి వేయడానికి సింగపూర్ ఎయిర్ లైన్స్(ఎస్ఐఎ)తో టాటా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. విస్తారాలో టాటాకు 51 శాతం వాటా ఉండగా, మిగిటిన వాటా సింగపూర్ ఎయిర్ లైన్స్ కలిగి ఉంది. మొత్తం మీద విమానయాన కార్యకలాపాలన్నీ ఒకే హోల్డింగ్ కంపెనీ కిందకు తెచ్చేందుకే టాటా సన్స్ ప్రాధాన్యమిస్తోంది. ప్రయత్నిస్తోందని చెబుతున్నారు.