ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ నూతన కమాడెంట్‌గా సంజీవ్‌ కపూర్‌

ABN , First Publish Date - 2021-08-02T06:07:03+05:30 IST

దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ కమాండెంట్‌గా

ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ నూతన కమాడెంట్‌గా సంజీవ్‌ కపూర్‌
భాధ్యతలు చేపడుతున్న సంజీవ్‌ కపూర్‌

అల్వాల్‌, ఆగస్ట్‌ 1 (ఆంధ్రజ్యోతి): దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ కమాండెంట్‌గా ఎయిర్‌ మార్షల్‌ సంజీవ్‌ కపూర్‌ ఆదివారం భాధ్యతలు చేపట్టారు. ఎయిర్‌ మార్షల్‌ సంజీవ్‌ కపూర్‌  గగనతలంలో 7700 గంటల పాటు రవాణ, శిక్షణ, గ్లైడర్‌ వంటి వివిధ వైవిద్యభరిత విమానాలను నడిపిన ఘనత ఆయన స్వంతం. భారత వైమానిక దళంలో 36 సంవత్సరాల అనుభవం ఉంది. వాయుసేనలో ఏరియల్‌ రీ ప్యూలింగ్‌  మార్గదర్శకాలు చేసిన వారిలో సంజీవ్‌కపూర్‌ కూడా ఉన్నారు. భారత వాయుసేనలో మూడు దశాబ్ధాలుగా విశిష్ఠసేవలనందించారు.  కాలేజ్‌ అఫ్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ సికింద్రాబాద్‌, అసిస్టెంట్‌ చీఫ్‌ ఎయిర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఎయిర్‌స్టాఫ్‌ ఆపరేషన్స్‌ బాధ్యతలు చేపట్టారు.  సంజీవ్‌ కపూర్‌ అత్యున్నత నైపుణ్యం, విశిష్ఠ సేవా భావాన్ని దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం విశిష్ఠ సేవా పతకంతో పాటు, వాయు సేన పతకాన్ని అందించి గౌరవించారు.   

Updated Date - 2021-08-02T06:07:03+05:30 IST