నిర్ణయం మార్చుకున్న దుబాయ్.. ఎయిర్ ఇండియా విమానాలకు గ్రీన్ సిగ్నల్!

ABN , First Publish Date - 2020-09-19T15:44:26+05:30 IST

భారత్ నుంచి దుబాయికి వెళ్లే ప్రయాణికులకు దుబాయ్ పౌర విమానయాన శాఖ తీపి కబురు చెప్పింది. ఎయిర్ ఇండియా వి

నిర్ణయం మార్చుకున్న దుబాయ్.. ఎయిర్ ఇండియా విమానాలకు గ్రీన్ సిగ్నల్!

దుబాయి: భారత్ నుంచి దుబాయికి వెళ్లే ప్రయాణికులకు దుబాయ్ పౌర విమానయాన శాఖ తీపి కబురు చెప్పింది. ఎయిర్ ఇండియా విమానాలపై విధించిన తాత్కాలిక నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం శనివారం నుంచి దుబాయి-ఇండియాల మధ్య ఎయిర్ ఇండియా విమానాల రాకపోకలు కొనసాగుతాయని వెల్లడించింది. కాగా.. కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఎయిర్ ఇండియా విమానాలపై అక్టోబర్ 2 వరకు నిషేధం విధిస్తున్నట్లు దుబాయ్ పౌర విమానయాన శాఖ శుక్రవారం ప్రకటించింది. రెండు వారాల్లో కొవిడ్ బారినపడ్డ ఇద్దరు ప్రయాణికులను.. ఎయిర్ ఇండియా విమానం దుబాయికి తీసుకొచ్చినట్లు ప్రకటనలో పేర్కొంది. అయితే నిషేధం విధించిన గంటల వ్యవధిలోనే.. దుబాయ్ పౌర విమానయానశాఖ తన నిర్ణయాన్ని మార్చుకుంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. దుబాయి-ఇండియా మధ్య ఎయిర్ ఇండియా విమానాలు రాకపోకలు కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 


Updated Date - 2020-09-19T15:44:26+05:30 IST