ఢిల్లీ-మాస్కో విమానాన్ని రద్దు చేసిన ఎయిర్ ఇండియా!

ABN , First Publish Date - 2022-04-07T22:42:23+05:30 IST

ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ-మాస్కో మధ్య విమాన సర్వీసుల..

ఢిల్లీ-మాస్కో విమానాన్ని రద్దు చేసిన ఎయిర్ ఇండియా!

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ-మాస్కో మధ్య విమాన సర్వీసులను రద్దు చేసినట్టు తెలిసింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారికి పూర్తి డబ్బులు వెనక్కి ఇవ్వనున్నట్టు సమాచారం. ఢిల్లీ-మాస్కో-ఢిల్లీ మార్గంలో ఎయిర్ ఇండియా వారానికి రెండు విమానాలు నడుపుతోంది. ఇప్పుడీ విమానాలను రద్దు చేసినట్టు రష్యన్ ఎంబసీ తెలిపింది.


ఈ సేవలను ఎప్పుడు పునరుద్ధరిస్తారన్న విషయంలో స్పష్టత లేదని, ఈ మార్గంలో ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారికి పూర్తి రిఫండ్ చేయనున్నట్టు ఎంబసీ తెలిపింది. అయితే, ఈ విషయంలో ఎయిర్ ఇండియా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. ఉక్రెయిన్‌పై  రష్యా యుద్ధం నేపథ్యంలో విమానాలకు ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో విమానాలకు బీమా కవరేజ్ ఇచ్చేందుకు సంస్థలు నిరాకరిస్తున్నాయని, అందుకనే ఈ సర్వీసులను రద్దు చేసినట్టు చెబుతున్నారు.

Updated Date - 2022-04-07T22:42:23+05:30 IST