143 మంది ప్రయాణికులతో భారత్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం

ABN , First Publish Date - 2020-06-04T05:57:45+05:30 IST

లాక్‌డౌన్ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ‘వందే భారత్ మిషన్’‌లో భాగంగా ఇండియాకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా.. రష్యా నుంచి

143 మంది ప్రయాణికులతో భారత్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం

మాస్కో: లాక్‌డౌన్ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ‘వందే  భారత్ మిషన్’‌లో భాగంగా ఇండియాకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా.. రష్యా నుంచి ఏడవ ప్రత్యేక విమానం 143 మంది భారతీయులతో ఈ రోజు బయల్దేరింది. ఈ విషయాన్ని మాస్కోలోని భారత రాయబార కార్యలయం ట్విట్టర్‌లో వెల్లడించింది. ‘143 మంది ప్రయాణికులతో మాస్కో నుంచి గయాకు ఎయిర్ ఇండియా విమానం బయల్దేరింది’ అని మాస్కోలోని భారత రాయబార కార్యలయం ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే.. ‘వందే భారత్ మిషన్’‌లో భాగంగా మే 6 నుంచి ఇప్పటి వరకు దాదాపు 57వేల మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. 



Updated Date - 2020-06-04T05:57:45+05:30 IST