ప్రమాదానికి గురైన మైక్ పెన్స్ విమానం.. ఆయన మాత్రం సేఫ్!
ABN , First Publish Date - 2020-09-23T23:52:44+05:30 IST
అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్.. ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. దీంతో పైలెట్లు విమానాన్ని అ
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్.. ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది. దీంతో పైలెట్లు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసిన ఘటన మంగళవారం రాత్ర చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. దీంతో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్.. తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఆయన న్యూ హాంప్షైర్ రాష్ట్రంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి మంగళవారం రోజు హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన అనంతరం ఆయన తిరుగుపయనం అయ్యారు. అయితే ఆయన ప్రయాణిస్తున్న ఎయిర్ ఫోర్స్ 2 విమానాన్ని పక్షి ఢీ కొట్టడంతో.. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే న్యూ హాంప్షైర్ విమానాశ్రయంలో తిరిగి ల్యాండ్ అయింది. కాగా.. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని అక్కడి అధికారులు తెలిపారు. అయితే.. ఉపాధ్యక్షుడి కోసం మరో విమానాన్ని సిద్ధం చేయడంతో ఆయన అందులో మేరీలాండ్కు వెళ్లినట్లు చెప్పారు.