ఎయిర్ ఆసియా ఇండియా కీలక ప్రకటన!
ABN , First Publish Date - 2021-04-19T11:24:50+05:30 IST
కొవిడ్-19 కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణాలకు సంబంధించిన ఆంక్షలు, అనిశ్చిత పరిస్థితులు పెరిగిపోతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని విమాన ప్రయాణికులకు కాస్త వెసు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: కొవిడ్-19 కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణాలకు సంబంధించిన ఆంక్షలు, అనిశ్చిత పరిస్థితులు పెరిగిపోతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని విమాన ప్రయాణికులకు కాస్త వెసులుబాటు కల్పించేందుకు ఎయిర్ ఆసియా ఇండియా తాజాగా ఒక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా మే 15 వరకు బుక్ చేసుకున్న టికెట్లలో సమయం, తేదీలో చేసుకునే మార్పులకు ఎలాంటి రుసుమును వసూలు చేయబోమని ఆదివారం ప్రకటించింది. కొవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు పలు రకాల ఆంక్షలను విధిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇండిగో, స్పైస్జెట్ వంటి కంపెనీలు ఉచితంగా రీషెడ్యూలింగ్కు అనుమతిస్తున్నట్టు ప్రకటించాయి.