UAE నుంచి భారత్ వచ్చేవారికి Air Arabia బంపరాఫర్.. చాలా చీప్‌గా స్వదేశానికి రావొచ్చు!

ABN , First Publish Date - 2021-10-30T14:02:08+05:30 IST

యూఏఈకి చెందిన బడ్జెట్ క్యారియర్ ఎయిర్ అరేబియా సరికొత్త ఆఫర్‌తో భారత్‌కు విమాన సర్వీసులు ప్రకటించింది.

UAE నుంచి భారత్ వచ్చేవారికి Air Arabia బంపరాఫర్.. చాలా చీప్‌గా స్వదేశానికి రావొచ్చు!

అబుధాబి: యూఏఈకి చెందిన బడ్జెట్ క్యారియర్ ఎయిర్ అరేబియా సరికొత్త ఆఫర్‌తో భారత్‌కు విమాన సర్వీసులు ప్రకటించింది. నవంబర్ మొదటి వారం నుంచి ఈ విమాన సర్వీసులు నడపనున్నట్లు పేర్కొంది. కేరళ రాష్ట్రంలోని కొచ్చి, కోజికోడ్, తిరువనంతపురంకు నేరుగా ఈ విమాన సర్వీసులు నడపనుంది. అబుధాబి నుంచి ఈ మూడు గమ్యస్థానాలకు విమాన టికెట్ ధర కేవలం 499 దిర్హామ్స్(రూ.10,179) మాత్రమే. వచ్చే నెల 3, 5, 16 తేదీల్లో విమాన సర్వీసులు ఉంటాయని ఎయిర్ అరేబియా వెల్లడించింది. ఈ విమాన సర్వీసుల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...

* నవంబర్ 3న రాత్రి 10.55 గంటలకు(యూఏఈ కాలమానం ప్రకారం) అబుధాబి నుంచి కొచ్చికి మొదటి విమాన సర్వీస్

* నవంబర్ 5న రాత్రి 11.30 గంటలకు(యూఏఈ కాలమానం ప్రకారం) అబుధాబి నుంచి కోజికోడ్‌కు రెండో సర్వీస్

* నవంబర్ 16న మధ్యాహ్నం 1.15 గంటలకు (యూఏఈ కాలమానం ప్రకారం) అబుధాబి నుంచి తిరువనంతపురంకు మూడో విమాన సర్వీస్ ఉంటుంది.

ప్రయాణికులు ఎయిర్ అరేబియా అధికారిక వెబ్‌సైట్ airarabia.com నుంచి విమాన టికెట్లు కోనుగోలు చేయవచ్చు.       

Updated Date - 2021-10-30T14:02:08+05:30 IST