కిటికీలు తెరవండి.. ఇంట్లోకి గాలి రానీయండి!
ABN , First Publish Date - 2021-04-19T09:35:01+05:30 IST
ఆరుబయట కన్నా.. ఇంట్లోనే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. దీని నివారణకు వెంటిలేషన్ ఎంతో మేలు చేస్తుందని,
మండు వేసవిలో చక్కని వెంటిలేషన్ మేలు: ఎయిమ్స్ చీఫ్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: ఆరుబయట కన్నా.. ఇంట్లోనే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. దీని నివారణకు వెంటిలేషన్ ఎంతో మేలు చేస్తుందని, ఈ మండు వేసవిలో ఇళ్లలోకి ధారాళంగా గాలి ప్రసరించేలా కిటికీలు, వెంటిలేటర్లు బాగా తెరిచివుంచుకోవాలని సూచించారు. దగ్గు, తుమ్ములతో వెలువడే తుంపరల కన్నా గాలి ద్వారా ఎక్కువగా వైరస్ వ్యాప్తి చెందుతోందని కొత్త పరిశోధనల్లో వెల్లడైన నేపథ్యంలో రణదీప్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. తలుపులు, కిటికీలు మూసివేసుకున్న ఇళ్లలో ఒకరికి వైరస్ సోకితే ఇంట్లోని మిగతావారికి కూడా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన చెప్పారు.
మేరకు వైద్య పత్రిక లాన్సెట్కు ఆయన ఓ ఆర్డికల్ను రాశారు. ‘‘మీరు ఉండే గదిలోకి బయటి నుంచి చక్కగా గాలి వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి. ఆ గదిలో సమావేశాలు, అరుపులు లేకుంటే మరీ మంచిది’’ అని పేర్కొన్నారు. వైరస్ సోకిన వ్యక్తికి 10 మీటర్ల దూరంలో ఉండి మాట్లాడితే ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉండవని చెప్పారు.