ఏయూ వీసీతో ఏఐఐఎల్‌ఎస్‌జీ డీజీ సమావేశం

ABN , First Publish Date - 2022-08-09T06:16:47+05:30 IST

ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్‌ పి.వి.జి.డి.ప్రసాద్‌రెడ్డితో సోమవారం వర్సిటీలో ఆల్‌ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లోకల్‌ సెల్ఫ్‌ గవర్నమెంట్‌(ఏఐఐఎల్‌ఎస్‌జీ) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ జైరాజ్‌ ఫాఠక్‌ సమావేశమయ్యారు.

ఏయూ వీసీతో ఏఐఐఎల్‌ఎస్‌జీ డీజీ సమావేశం
వీసీకి నివేదికను అందజేస్తున్న డాక్టర్‌ జైరాజ్‌ పాఠక్‌

ఏయూ క్యాంపస్‌, ఆగస్టు 8: ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్‌ పి.వి.జి.డి.ప్రసాద్‌రెడ్డితో సోమవారం వర్సిటీలో ఆల్‌ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లోకల్‌ సెల్ఫ్‌ గవర్నమెంట్‌(ఏఐఐఎల్‌ఎస్‌జీ) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ జైరాజ్‌ ఫాఠక్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ఏయూతో ఏఐఐఎల్‌ఎస్‌జీ సంస్థ ఎంవోయూ చేసుకునేందుకు ముందుకు వచ్చిందన్నారు. సంయుక్తంగా కోర్సుల నిర్వహణ, పరిశోధనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ కృష్ణమోహన్‌, ఆచార్యులు చల్లా రామకృష్ణ, కృష్ణవీర్‌ అభిషేక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-09T06:16:47+05:30 IST