ఏఐఎల్ఆర్ఎస్ జోనల్ ఉపాధ్యక్షుడు మృతి
ABN , First Publish Date - 2022-06-30T05:32:59+05:30 IST
రైల్వే ఆలిండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ జోనల్ ఉపాధ్యక్షుడు బలరామయ్య (80) బుధవారం గుండె పోటుతో మృతిచెందారు.
గుంతకల్లుటౌన్, జూన్ 29: రైల్వే ఆలిండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ జోనల్ ఉపాధ్యక్షుడు బలరామయ్య (80) బుధవారం గుండె పోటుతో మృతిచెందారు. గుంతకల్లు రైల్వే డివిజన్లో లోకో పైలెట్గా పనిచేసిన ఈయన 20 ఏళ్ల కిందట రాజధాని ఎక్స్ప్రెస్ డ్రైవర్గా విధులు నిర్వర్తించి రిటైరయ్యారు. అప్పటి నుం చి ఏఐఎల్ఆర్ఎస్ సంఘ నాయ కుడిగా లోకోపైలెట్లు, సహాయ లోకో పైలెట్లు, గార్డుల సమస్యల పరిష్కా రానికి పోరాటాలు చేశారు. ఈయన 1997 నుంచి 1999 వరకూ సీపీఐ అను బంధ ఏఐటీయూసీ మండల కార్య దర్శిగా పనిచేశారు. బలరామయ్య మరణం గురించి తెలిసిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డీ జగదీశ్, రైతుల సంఘ జిల్లా అధ్యక్షుడు గోవిందు, నియోజకవర్గ కార్యదర్శి వీరభద్రస్వామి, ఏఐఎల్ఆర్ఎస్ఏ నాయకులు, సభ్యులు వెళ్లి మృత దేహం వద్ద నివాళు లర్పించారు.