3చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతం: ఏఐకేఎస్‌

ABN , First Publish Date - 2021-02-28T08:52:20+05:30 IST

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలను ఉధృతం చేస్తామని అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య తెలిపారు

3చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతం: ఏఐకేఎస్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలను ఉధృతం చేస్తామని అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య తెలిపారు. దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న ఉద్యమం 20 రాష్ట్రాలకు ఉద్యమం విస్తరించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌; తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఉద్యమం ఊపందుకుంటుందన్నారు. కాగా, ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ, కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మార్చి 5న ఏపీ బంద్‌కు సిద్ధమవుతున్నామని ఏపీ రైతు సంఘం ప్రధానకార్యదర్శి కేవీవీ ప్రసాద్‌ తెలిపారు.  

Updated Date - 2021-02-28T08:52:20+05:30 IST