రియల్ హీరో..ఎయిమ్స్ నర్సింగ్ ఆఫీసర్ కనిష్క్ యాదవ్

ABN , First Publish Date - 2020-04-03T14:53:53+05:30 IST

దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న వేళ కరోనా రోగుల ఐసోలేషన్ వార్డులో పనిచేసేందుకు స్వచ్చందంగా ముందుకు వచ్చిన ఎయిమ్స్ నర్సింగ్ ఆఫీసర్ కనిష్క్ యాదవ్ నిజమైన హీరోగా నిలిచారు.....

రియల్ హీరో..ఎయిమ్స్ నర్సింగ్ ఆఫీసర్ కనిష్క్ యాదవ్

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న వేళ కరోనా రోగుల ఐసోలేషన్ వార్డులో పనిచేసేందుకు స్వచ్చందంగా ముందుకు వచ్చిన ఎయిమ్స్ నర్సింగ్ ఆఫీసర్ కనిష్క్ యాదవ్ నిజమైన హీరోగా నిలిచారు.ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో నర్సింగ్ ఆఫీసరుగా పనిచేస్తున్న కనిష్క్ యాదవ్ తనను కొవిడ్ -19 రోగులున్న ఐసోలేషన్ వార్డులో నియమించమని పరిపాలనాధికారికి రాసిన లేఖలో కోరారు.


‘‘నాకు అత్యవసర పరిస్థితుల్లో రోగులకు చికిత్స అందించడంలో సమర్ధత ఉంది. అందుకే  కరోనా రోగులున్న ట్రామా సెంటరులో నన్ను నియమించండి’’ అంటూ కనిష్క్ యాదవ్ ఎయిమ్స్ పరిపాలనాధికారికి రాసిన లేఖలో కోరారు. కరోనా రోగులుంటున్న వార్డులో పనిచేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన నర్సింగ్ ఆఫీసర్ కనిష్క్ యాదవ్ ను రియల్ హీరో అంటూ అందరూ ప్రశంసించారు. కరోనా వైరస్ ప్రబలకుండా నివారించేందుకు ప్రజలందరూ సామాజిక దూరం పాటించాలని కనిష్క్ యాదవ్ సూచించారు. 

Updated Date - 2020-04-03T14:53:53+05:30 IST