ఎయిడ్స్‌ నివారణకు అంతా భాగస్వామ్యులు కావాలి: డీఎంహెచ్‌వో

ABN , First Publish Date - 2022-05-16T04:22:31+05:30 IST

ఎయిడ్స్‌ నివారణకు అంతా భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధాకర్‌ నాయక్‌ అన్నారు.

ఎయిడ్స్‌ నివారణకు అంతా భాగస్వామ్యులు కావాలి: డీఎంహెచ్‌వో
కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహిస్తున్న సిబ్బంది

ఆసిఫాబాద్‌ రూరల్‌, మే 15: ఎయిడ్స్‌ నివారణకు అంతా భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధాకర్‌ నాయక్‌ అన్నారు. అంతర్జాతీయ ఎయిడ్స్‌ కొవ్వొత్తుల దినోత్సవం ఆదివారం ఆసిఫాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు1,77,859 మందికి ఎయిడ్స్‌ పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. ఇందులో 723మందికి ఎయిడ్స్‌ సోకినట్టు తేలిం దన్నారు. ఇందులో 161మంది చనిపోయినట్టు తెలిపారు. కార్యక్రమంలో టీసాక్స్‌ యూత్‌ కోఆర్డినేటర్‌ గందె రమేష్‌, సతీష్‌, హరీష్‌, చేతన స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు మేనేజర్‌ సతీష్‌, శ్రీసాయి మహిళా మండలి ప్రాజెక్టు మేనేజర్‌ సునీల్‌, ఔట్‌రీచ్‌ వర్కర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-16T04:22:31+05:30 IST