TamilNadu: మాజీ ముఖ్యమంత్రి సతీమణి కన్నుమూత
ABN , First Publish Date - 2021-09-01T17:22:30+05:30 IST
తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే పార్టీ కోఆర్డినేటర్ ఓ పన్నీర్ సెల్వం సతీమణి విజయలక్ష్మీ (63) బుధవారం ఉదయం గుండెపోటుతో మరణించారు....
చెన్నై : తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే పార్టీ కోఆర్డినేటర్ ఓ పన్నీర్ సెల్వం సతీమణి విజయలక్ష్మీ (63) బుధవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. మాజీ సీఎం సతీమణి విజయలక్ష్మీ గత రెండు వారాలుగా గుండెపోటుతో చెన్నై నగరంలోని జెమ్ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విజయలక్ష్మీ బుధవారం కన్నుమూశారు. విజయలక్ష్మీ మృతి పట్ల మాజీ ఆరోగ్యశాఖ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ సి విజయభాస్కర్ సంతాపం తెలిపారు. విజయలక్ష్మీ కుమారుడు ఓపీ రవీంద్రనాథ్ ఎంపీగా ఉన్నారు. మాజీ సీఎం భార్య విజయలక్ష్మీ మృతి పట్ల పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.