తమిళనాడు: ఏఐఏడీఎంకేతో బీజేపీ దోస్తీ... 20 సీట్ల నుంచి పోటీ!

ABN , First Publish Date - 2021-03-06T14:30:03+05:30 IST

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ...

తమిళనాడు: ఏఐఏడీఎంకేతో బీజేపీ దోస్తీ... 20 సీట్ల నుంచి పోటీ!

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధికార పార్టీ ఏఐఏడీఎంకేతో జతకట్టి ఎన్నికల బరిలోకి దిగనుంది. సీట్ల పంపకంలో రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిరింది. ఈ నేపధ్యంలో బీజేపీ తమిళనాడులోని 20 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయనుంది.  


ఇరు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు కన్యాకుమారి లోక్‌సభ సీటును బీజేపీకి కేటాయించారు. కన్యాకుమారి ఎంపీ హెచ్ వసంత్‌కుమార్ మృతి చెందిన అనంతరం ఈ స్థానంలో ఖాళీ ఏర్పడింది. కరోనా కారణంగా ఎంపీ హెచ్ వసంత్‌కుమార్ కన్నుమూశారు. ఆయన కాంగ్రెస్ టిక్కెట్‌పై ఎంపీగా ఎన్నికయ్యారు.

Updated Date - 2021-03-06T14:30:03+05:30 IST