ఎయిర్ ఇండియాలో 48 పైలట్లకు ఉద్వాసన!

ABN , First Publish Date - 2020-08-16T05:11:21+05:30 IST

ఏకంగా 48 మంది పైలట్లకు ఎయిర్ ఇండియా అకస్మాత్తుగా ఉద్వాసన పలికింది.

ఎయిర్ ఇండియాలో 48 పైలట్లకు ఉద్వాసన!

న్యూఢిల్లీ: ఏకంగా 48 మంది పైలట్లకు ఎయిర్ ఇండియా అకస్మాత్తుగా ఉద్వాసన పలికింది. సంస్థ ఆర్థిక స్థితి దృష్ట్యా ఇకపై జీతాలు చెల్లించలేమంటూ వారిని ఇంటికి పంపించేసింది. వీరిలో కొంత మంది 2019లోనే రిజైన్ ఇచ్చినా.. ఆ తరువాత తమ నిర్ణయాన్ని వారు వెనక్కు తీసుకున్నట్టు సమచారం. ఆ పైలట్లలో కొందరు అంతకుముందు రోజు కూడా డ్యూటీ చేశారని సమచారం. ‘ప్రస్తుతం ఎయిర్ ఇండియా కార్యకలాపాలు కరోనాకు మునుపటి స్థితిలో లేవు. భవిష్యత్తులో కూడా కార్యకలాపాలు ఊపందుకునే అవకాశం లేదు. ప్రస్తుతం ఎయిర్ ఇండియా భారీ నష్టాలను మూటగట్టుకుంటోంది. జీతాలు చెల్లించే స్థితిలో లేదు’ అని సంస్థ తన లేఖలో పేర్కొన్నట్టు సమాచారం.

Updated Date - 2020-08-16T05:11:21+05:30 IST