ఉత్సవమూర్తులకు రెండో రోజు వసంతోత్సవం
ABN , First Publish Date - 2021-05-09T05:33:31+05:30 IST
అహోబిలం శ్రీలక్ష్మీనరసింహస్వామి ఉత్సవమూర్తులకు వేదపండితులు శనివారం రెండో రోజు వసంతోత్సవం నిర్వహించారు.
ఆళ్లగడ్డ, మే 8: అహోబిలం శ్రీలక్ష్మీనరసింహస్వామి ఉత్సవమూర్తులకు వేదపండితులు శనివారం రెండో రోజు వసంతోత్సవం నిర్వహించారు. ఈ ఏడాది ప్రజలు సుభిక్షంగా ఉండాలన్న ఆకాంక్షతో ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు అభిషేకాలు, పూజలు చేసినట్లు ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్ తెలిపారు.