శునకంపై ప్రేమతో రూ.7లక్షలు ఖర్చు చేసి ఘనంగా పుట్టిన రోజు ఏర్పాట్లు.. నెట్టింట వైరల్ అవడంతో చివరకు..

ABN , First Publish Date - 2022-01-09T02:18:16+05:30 IST

అతడికి తన పెంపుడు కుక్క అంటే ఎంతో ప్రేమ. చివరికి ఆ ప్రేమే అతడిని జైలుపాలు జేసింది. ఇందుకు సంబంధించిన విషయం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనికి గురించిన పూర్తి

శునకంపై ప్రేమతో రూ.7లక్షలు ఖర్చు చేసి ఘనంగా పుట్టిన రోజు ఏర్పాట్లు.. నెట్టింట వైరల్ అవడంతో చివరకు..

ఇంటర్నెట్ డెస్క్: అతడికి తన పెంపుడు కుక్క అంటే ఎంతో ప్రేమ. చివరికి ఆ ప్రేమే అతడిని జైలుపాలు చేసింది. ఇందుకు సంబంధించిన విషయం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనికి గురించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


దేశ వ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. విపరీతంగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కొవిడ్ నిబంధనలను అతిక్రమించాడు. రూ.7లక్షలతో తన పెంపుడు శునకం పుట్టిన రోజు వేడుకలు జరిపాడు. డీజే ఏర్పాటు చేసి, ఆటపాటలతో హంగామా చేశాడు. కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదికాస్త వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 






Updated Date - 2022-01-09T02:18:16+05:30 IST