అహ్మద్ పటేల్ మృతి పట్ల చంద్రబాబు సంతాపం
ABN , First Publish Date - 2020-11-25T20:43:58+05:30 IST
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపిన ఆయన..
ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపిన ఆయన.. అహ్మద్ పటేల్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అహ్మద్ పటేల్ కరోనాకు చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. గురుగావ్లోని మేదాంత ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం 3.30 గంటలకు అహ్మద్ పటేల్ మృతి చెందారని ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్విటర్ ద్వారా తెలియజేశారు.