అహింసే గాంధీజీ ఆయుధం: గవర్నర్
ABN , First Publish Date - 2022-10-03T09:26:23+05:30 IST
అహింసే గాంధీజీ ఆయుధం: గవర్నర్
అమరావతి, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): అహింస అనే ఆయుధంతోనే ఆంగ్లేయులకు వ్యతిరేకంగా మహాత్మ గాంధీజీ పోరాడి దేశానికి స్వాంత్ర్యాన్ని సాధించారని గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. మహాత్మ గాంధీ 153వ జయంతి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 118వ జయంతి సందర్భంగా విజయవాడలోని రాజ్భవన్లో గవర్నర్ దంపతులు మహానేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియా, రాజ్భవన్ సంయుక్త కార్యదర్శి సూర్యప్రకాశ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.