టెక్నాలజీతో లాభదాయకంగా వ్యవసాయం: మోడీ

ABN , First Publish Date - 2022-02-05T21:12:49+05:30 IST

నగరంలోని ఇక్రిశాట్‌లో ప్రధాని మోడీ వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలను

టెక్నాలజీతో లాభదాయకంగా వ్యవసాయం: మోడీ

హైదరాబాద్: నగరంలోని ఇక్రిశాట్‌లో ప్రధాని మోడీ వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. స్సర్ణోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. ఆజాదీ కీ అమృతోత్సవ్ వేళ ఇక్రిశాట్‌ స్సర్ణోత్సవాలను జరుపుకుంటుందన్నారు.  సంస్థ ప్రారంభం నుంచి ఇప్పటివరకు పనిచేసిన వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు. మెట్ట ప్రాంత రైతులకు ఇక్రిశాట్‌ పరిశోధనలు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. టెక్నాలజీని మార్కెట్‌తో అనుసంధానించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు ఇక్రిశాట్‌ కృషి చేస్తుందని ఆయన అన్నారు. వాతావరణ మార్పుల కేంద్రం రైతులకు ఎంతో ఉపయోగకరమన్నారు. 



Updated Date - 2022-02-05T21:12:49+05:30 IST