రైతులకు పరిహారం చెల్లింపునకు కృషి చేస్తా

ABN , First Publish Date - 2021-09-29T05:38:52+05:30 IST

వరదలకు నష్టపోయిన ప్రతీ రైతుకు ప్రభుత్వం తరపున పరిహారం అందించేలా కృషిచేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌ సీహెచ్‌ అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

రైతులకు పరిహారం చెల్లింపునకు కృషి చేస్తా
రైతులతో మాట్లాడుతున్న వ్యవసాయ శాఖ కమిషనర్‌

తాడేపల్లిగూడెం రూరల్‌, సెప్టెంబర్‌ 28: వరదలకు నష్టపోయిన ప్రతీ రైతుకు ప్రభుత్వం తరపున పరిహారం అందించేలా కృషిచేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌ సీహెచ్‌ అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు. వరదలకు నీటమునిగిన వరిచేలను మాధవరం, జగన్నాథపురం గ్రామాల్లో వరిచేలను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు వారి గోడును ఆయన ముందు వెళ్ళబోసుకున్నారు. వరి పంట వారం పదిరోజుల్లో చేతికి వచ్చే తరుణంలో ఇలా వరి నీటమునకకు గురైందని దీని ప్రభావంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రకాల్వ గట్లు పటిష్టం చేయాలని ప్రతీ ఏటా చిన్నపాటి వరద వచ్చినా పంట మొత్తం నష్టపోతున్నామని వాపోయారు. దీనిపై కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ శాస్త్రవేత్తలతో పంటనష్టం అంచనావేసి పరిహారం అందించేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జేడీ జగ్గారావు, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఎంపీపీ పునుకుమాటి శేషులత, ఆత్మా పీడి వంశీ, శాస్త్రవేత్తలు ఫణి, రఘు, ఏడీఏ పి.మురళీకృష్ణ, ఏవో ఆర్‌ఎస్‌ ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-09-29T05:38:52+05:30 IST