వ్యవసాయ బిల్లులు ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2020-09-25T06:36:17+05:30 IST

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని వెంకటగిరి, సర్వేపల్లి కాంగ్రెస్‌పార్టీ ఇన్‌చార్జులు పంటా

వ్యవసాయ బిల్లులు ఉపసంహరించుకోవాలి

గూడూరు, సెప్టెంబరు 24: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని వెంకటగిరి, సర్వేపల్లి కాంగ్రెస్‌పార్టీ ఇన్‌చార్జులు పంటా శ్రీనివాసులురెడ్డి, పూల చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక కాంగ్రెస్‌ కార్యాలయంలో వారు మాట్లాడుతూ బీజేపీకి వైసీపీ, టీడీపీలు దాసోహం అయ్యాయన్నారు. వ్యవసాయ బిల్లులకు రెండు పార్టీలు మద్దతు ప్రకటించడం దారుణమన్నారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి కార్పొరేట్‌  సంస్థలకు కట్టపెట్టే వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలన్నారు. 

Updated Date - 2020-09-25T06:36:17+05:30 IST