అగ్రిసెట్ ఫలితాలు విడుదల
ABN , First Publish Date - 2020-10-24T08:47:12+05:30 IST
అగ్రిసెట్ ఫలితాలు విడుదల
రాజేంద్రనగర్/హైదరాబాద్, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి) : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఈనెల 13న నిర్వహించిన అగ్రిసెట్, అగ్రి ఇంజనీరింగ్ సెట్ - 2020 ఫలితాలను వర్సిటీ ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్రావు శుక్రవారం విడుదల చేశారు. వ్యవసాయ డిప్లొమా, వ్యవసాయ ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సుల్లో సీట్లను ఈ ప్రవేశ పరీక్షల ద్వారా భర్తీ చేస్తారు. అగ్రికల్చరల్ డిప్లొమాలో1252, సీడ్ టెక్నాలజీలో 128, అగ్రి ఇంజనీరింగ్లో 64, ఆర్గానిక్ అగ్రికల్చరల్ డిప్లొమా పూర్తి చేసిన 45 మంది ఈ ప్రవేశ పరీక్షలకు హాజరైనట్లు ఉపకులపతి తెలిపారు. వీరిలో ర్యాంకుల ఆధారంగా బీఎస్సీ అగ్రికల్చర్లో 53, సీడ్ టెక్నాలజీలో 7, ఆర్గానిక్ అగ్రికల్చర్లో 5, అగ్రికల్చర్లో 5, అగ్రికల్చర్ డిప్లొమా విద్యార్థులకు 7 సీట్లు కేటాయించామన్నారు.