‘అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలి’
ABN , First Publish Date - 2020-09-29T17:59:19+05:30 IST
అగ్రిగోల్డ్ బాధితులను తక్షణం ఆదుకోవాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోషియేషన్..
కరప: అగ్రిగోల్డ్ బాధితులను తక్షణం ఆదుకోవాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోషియేషన్ ప్రతినిధి డి.సత్తిబాబు కోరారు. అసోసియేషన్ సభ్యులతో కలిసి సోమవారం ఆయన కరప తహశీల్దార్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సత్తిబాబు మాట్లాడుతూ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చినా నేటివరకు ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. అసోసియేషన్ సభ్యులు టి.వనుములు, జి.శివాజీ, ఎ.శ్రీను పాల్గొన్నారు.