తెలంగాణలో డేంజర్ బెల్స్

ABN , First Publish Date - 2022-05-16T22:33:50+05:30 IST

తెలంగాణ పంట భూముల్లో ప్రమాదకర భాస్వర నిల్వలు ఉన్నట్టు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం షాక్ ఇచ్చింది.

తెలంగాణలో డేంజర్ బెల్స్

హైదరాబాద్: తెలంగాణ పంట భూముల్లో ప్రమాదకర భాస్వర నిల్వలు ఉన్నట్టు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం షాక్ ఇచ్చింది. ఇటీవల యూనివర్శిటీ నిపుణులు నిర్వహించిన సర్వేలో పొలాల్లో భాస్వరం నిల్వలు పేరుకుపోయాయని వెల్లడించారు. రాష్ట్రంలోని 208 మండలాల్లో డేంజర్ స్థాయిలో కెమికల్ మోతాదులు మించినట్టు యూనివర్శిటీ వెల్లడించింది. మరో 154 మండలాల్లో అత్యధికం, 5 మండలాల్లో తక్కువ స్థాయిలో భాస్వర నిల్వలు పేరుకున్నాయన్నారు.నిజామాబాద్, కరీంనగర్, కామారెడ్డి, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో 90శాతం కన్నా ఎక్కువ భాస్వరం ఉన్నట్లు యూనివర్శిటీ అధికారులు వెల్లడించారు. 

Updated Date - 2022-05-16T22:33:50+05:30 IST