భీమవరం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా.. ఆందోళనలు

ABN , First Publish Date - 2022-08-12T05:15:50+05:30 IST

సమస్యల పరిష్కారం కోరుతు పలు సంఘాలు గురువారం భీమవరం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించాయి.

భీమవరం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా.. ఆందోళనలు
కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న వీఆర్‌ఏలు

భీమవరం, ఆగస్టు 11 : సమస్యల పరిష్కారం కోరుతూ పలు సంఘాలు గురువారం భీమవరం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించాయి. ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా చేసి వినతిపత్రం అందజేశారు. మాల మహానాడు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ ధర్నా చేశారు. అధ్యక్షులు చీకటిమిల్లి మంగరాజు మాట్లాడుతూ ఎస్సీలో ఐక్యంగా ఉండాలని ఎస్సీ వర్గీకరణ వద్దని డిమాండ్‌ చేశారు. మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం డిఆర్‌వో కార్యాలయం వినతిపత్రం అందజేశారు.

Updated Date - 2022-08-12T05:15:50+05:30 IST