ప్రైవేటీకరణ విధానం విడనాడాలి

ABN , First Publish Date - 2021-08-02T05:32:05+05:30 IST

ఉద్యమంతో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీ కరణను అడ్డుకుంటా మని ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు దూసనపూడి సోమ సుందర్‌ అన్నారు.

ప్రైవేటీకరణ విధానం విడనాడాలి
రైల్వే స్టేషన్‌ వద్ద ఏఐటీయూసీ నాయకుల ఆందోళన

తాడేపల్లిగూడెం రూరల్‌, ఆగస్టు 1: ఉద్యమంతో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీ కరణను అడ్డుకుంటా మని ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు దూసనపూడి సోమ సుందర్‌ అన్నారు. విశాఖ ఉక్కు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ఈనెల 2,3 తేదీల్లో పార్లమెంటు ఎదుట నిర్వహించ తలపెట్టిన మహాధర్నాలో పాల్గొనేందుకు తాడేపల్లిగూడెం నుంచి ఏఐటీయూసీ నాయకులు రైలులో బయల్దేరారు. కార్యక్రమంలో పట్టణ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఏడిద నాని, కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ కార్యదర్శి కె.ముత్యం, ఏరియా కమిటి కోశాధికారి ఎ.కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-02T05:32:05+05:30 IST