AP News: జగన్‌ దోపిడీ విలువ రూ.2లక్షల కోట్లు: టీడీపీ

ABN , First Publish Date - 2022-09-03T00:14:36+05:30 IST

Amaravathi: సీఎం జగన్‌ (CM Jagan)పై టీడీపీ (TDP) నేత పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) ధ్వజమెత్తారు. జగన్‌ మోహన్ రెడ్డి దోపిడీ విలువ

AP News: జగన్‌ దోపిడీ విలువ రూ.2లక్షల కోట్లు: టీడీపీ

Amaravathi: సీఎం జగన్‌ (CM Jagan)పై టీడీపీ (TDP) నేత పయ్యావుల కేశవ్ (Payyavula Keshav)  ధ్వజమెత్తారు. జగన్‌ మోహన్ రెడ్డి దోపిడీ విలువ రూ.2లక్షల కోట్లు అని ఆరోపించారు. లేపాక్షిలో రూ.18 వేల కోట్లు విలువచేసే 9వేల ఎకరాల భూమిని రూ.500 కోట్లకు కొట్టేసేందుకు ప్లాన్ జరుగుతోందని, కొత్తగా 20వేల ఎకరాలకు సంబంధించి రూ.20వేల కోట్లు విలువచేసే..వ్యాన్ పిక్ భూ కుంభకోణం కూడా ప్రారంభమైందని విమర్శించారు. టీడీపీ నేత నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) మాట్లాడుతూ ...జగన్‌ మూడేళ్ల పాలనలో ప్రజలకు ముప్పుతిప్పలు పెడుతున్నారని ఆరోపించారు. బాదుడు, భారాలు తప్ప బతుకులు బాగుచేసింది లేదని విమర్శించారు. చెత్త పన్నుతో పేదలను దోచుకుంటోన్న నయా తుగ్లక్ జగనేనని చమత్కరించారు. ఆయనకు పన్నులేయడం మాత్రమే తెలుసు.. పని చేయడం చేతకాదని విమర్శించారు.

Updated Date - 2022-09-03T00:14:36+05:30 IST