ప్రత్యేక హోదా విషయంలో జగన్‌ ఇంకా ఎందుకు మభ్యపెడుతున్నారు: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-05-29T02:11:01+05:30 IST

ప్రత్యేక హోదా విషయంలో సీఎం జగన్‌ ఇంకా ఎందుకు మభ్యపెడుతున్నారని సీపీఐ నేత రామకృష్ణ ఆరోపించారు. 25 మంది వైసీపీ ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలువంచి హోదా తెస్తానన్నారని

ప్రత్యేక హోదా విషయంలో జగన్‌ ఇంకా ఎందుకు మభ్యపెడుతున్నారు: రామకృష్ణ

అమరావతి: ప్రత్యేక హోదా విషయంలో సీఎం జగన్‌ ఇంకా ఎందుకు మభ్యపెడుతున్నారని సీపీఐ నేత రామకృష్ణ ఆరోపించారు. 25 మంది వైసీపీ ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలువంచి హోదా తెస్తానన్నారని, 22 మంది ఎంపీలను గెలిపించినప్పటికీ ప్రత్యేక హోదాపై దృష్టి పెట్టలేదని తప్పుబట్టారు. ఇప్పుడు బీజేపీకి మెజార్టీ ఉంది కాబట్టి హోదా అడగలేకపోతున్నామంటున్నారని చెప్పారు. రాజ్యసభలో బీజేపీకి మెజార్టీ లేదన్న విషయం మీకు తెలియదా? అని ప్రశ్నించారు. సీఏఏ, ఎన్‌ఆర్సీకి మద్దతిచ్చినప్పుడు ప్రత్యేకహోదా ఎందుకు డిమాండ్ చేయలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో మీ మద్దతు తీసుకునే ప్రభుత్వమే వస్తుందని ఎలా చెప్పగలరు? అని రామకృష్ణ మరోసారి ప్రశ్నించారు.

Updated Date - 2020-05-29T02:11:01+05:30 IST