ఆసరా కోసం వృద్ధుల అగచాట్లు
ABN , First Publish Date - 2021-04-21T07:08:14+05:30 IST
ఆసరా పింఛన్కోసం వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు అగచాట్లు పడుతున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీట్ మార్కెట్ లో ప్రతి నెలా పింఛన్లు పంపీణీ చేసేవారు. మూడు రోజులుగా సాం కేతిక సమస్య కారణంగా పింఛన్ పంపిణీ నిలిచిపోయింది.
కనిపించని కొవిడ్ నిబంధనలు
నల్లగొండ రూరల్: ఆసరా పింఛన్ కోసం వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు అగచాట్లు పడుతున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీట్ మార్కెట్ లో ప్రతి నెలా పింఛన్లు పంపీణీ చేసేవారు. మూడు రోజులుగా సాంకేతిక సమస్య కారణంగా పింఛన్ పంపిణీ నిలిచిపోయింది. మంగళవారం పింఛన్లు పంపిణీ చేయగా లబ్ధిదారులు గుంపులు, గుంపులుగా కొవిడ్ నిబంధనలు పాటించకుండా ఇలా ఎగబడ్డారు. ప్రతి నెలా 5వ తేదీలోపు ఇవ్వాల్సిన పింఛన్20వ తేదీ వరకు చెల్లించక పోయేసరికి అయోమయానికి గురవుతున్నారు. కొవిడ్ నేపథ్యంలో లబ్ధిదారులకు పింఛన్ నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని పలువురు కోరుతున్నారు.