తండ్రి మరణం.. ఏడుస్తూ ఇంటి ముందున్న కరెంటు స్తంభాన్ని పట్టుకున్న కొడుకు.. స్పాట్‌లోనే..

ABN , First Publish Date - 2021-07-26T22:04:17+05:30 IST

తండ్రి మరణ వార్త విని షాకయ్యాడు.. ఏడుస్తూ ఇంటి ముందుకున్న కరెంట్ స్తంభాన్ని పట్టుకున్నాడు..

తండ్రి మరణం.. ఏడుస్తూ ఇంటి ముందున్న కరెంటు స్తంభాన్ని పట్టుకున్న కొడుకు.. స్పాట్‌లోనే..

తండ్రి మరణ వార్త విని షాకయ్యాడు.. ఏడుస్తూ ఇంటి ముందుకున్న కరెంట్ స్తంభాన్ని పట్టుకున్నాడు.. అంతే.. షాక్ కొట్టి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.. ఒకే ఇంట్లో రెండు విషాదాలు సంభవించడం గ్రామస్తులందరినీ కలిచి వేస్తోంది.. బీహార్‌లోని దర్బంగాలో చోటు చేసుకుంది. అజమ్‌నగర్ ప్రాంతానికి చెందిన మోహన్ మహతో అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం చనిపోయాడు. 


విషాదంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. తండ్రి మరణ వార్త విని ఏడుస్తున్న పద్దెనిమిదేళ్ల కొడుకు రంజన్ నడుస్తూ ఇంటి ముందున్న కరెంట్ స్తంభాన్ని పట్టుకున్నాడు. అయితే దానికి వేలాడుతున్న కరెంట్ వైర్ తగలడంతో రంజన్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఒకే రోజు ఒకే ఇంట్లో రెండు మరణాలు సంభవించడంతో ఆ ప్రాంత వాసులు విషాదంలో మునిగిపోయారు. 

Updated Date - 2021-07-26T22:04:17+05:30 IST