పదేళ్ల ప్రేమ.. పది నెలల కిందట వివాహం.. అంతలోనే ఏమైందంటే..

ABN , First Publish Date - 2022-03-04T22:54:15+05:30 IST

వారిద్దరూ పదేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు.. తరచుగా కలుసుకునే వారు.. ఒకరి కుటుంబంతో మరొకరు అనుబంధం పెంచుకున్నారు..

పదేళ్ల ప్రేమ.. పది నెలల కిందట వివాహం.. అంతలోనే ఏమైందంటే..

వారిద్దరూ పదేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు.. తరచుగా కలుసుకునే వారు.. ఒకరి కుటుంబంతో మరొకరు అనుబంధం పెంచుకున్నారు.. పది నెలల కిందట ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.. అయితే వివాహం జరిగి పది నెలలైనా కాకముందే విడిపోవడానికి సిద్ధమయ్యారు.. భర్త ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పేసి మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.. భర్త కుటుంబం కట్నం కోసం వేధిస్తోందని మహిళ పోలీసులను ఆశ్రయించింది.. 


ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఆష్మా అనే యువతికి పదేళ్ల క్రితం ఓ పెళ్లి వేడుకలో ఇర్షాద్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం స్నేహంగా మారింది. క్రమంగా వారిద్దరూ ప్రేమలో పడ్డారు. తరచుగా కలుసుకుని మాట్లాడుకునే వారు. ఒకరి కుటుంబంతో మరొకరు అనుబంధం కూడా పెంచుకున్నారు. 2021లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నారు. 


అనంతరం ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. కట్నం కోసం ఆష్మాను అత్తింటి కుటుంబ సభ్యులు వేధించారు. వారు కోరినంత కట్నం ఆమె ఇవ్వలేకపోవడంతో వారు ఆమెను హింసించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కూడా ఆమెకు అండగా నిలవలేదు. అడిగినంత కట్నం ఇవ్వకపోతే వేరే యువతిని పెళ్లి చేసుకుంటానని బెదిరించాడు. అన్నట్టుగానే గతేడాది డిసెంబర్‌లో ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పేసి ఇంటి నుంచి బయటకు పంపేశాడు. 


అత్తింటి వారితో రాజీ కుదుర్చుకునేందుకు ఆష్మా రెండు నెలలు తీవ్రంగా ప్రయత్నించింది. అయితే వారు మాత్రం అందుకు సుముఖంగా లేరు. దీంతో ఆమె తాజాగా పోలీసులను ఆశ్రయించింది. అత్తింటి వారు తనను కట్నం కోసం వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2022-03-04T22:54:15+05:30 IST