ఆరేళ్ల క్రితం నిషేధం.. చివరకు తనేంటో నిరూపించుకున్న ఎవరెస్ట్ అధిరోహకుడు!
ABN , First Publish Date - 2022-06-04T21:17:00+05:30 IST
ప్రపంచంలోని ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్ను అధిరోహించాలని ఎంతో మంది పర్వతారోహకులు కలలు కంటూ ఉంటారు.
ప్రపంచంలోని ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్ను అధిరోహించాలని ఎంతో మంది పర్వతారోహకులు కలలు కంటూ ఉంటారు. ఇప్పటికి చాలా మంది ఎన్నో కష్టనష్టాలకోర్చి తమ కలను నెరవేర్చుకున్నారు. భారతీయ అధిరోహకుడు నరేందర్ సింగ్ యాదవ్ కూడా 2016లో తాను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్టు ప్రకటించాడు. 2016 మే నెలలో 8,849 మీటర్ల ఎత్తైన పర్వత శిఖరానికి చేరుకున్నట్టు చెప్పాడు. అయితే అందుకు సాక్ష్యంగా చూపించిన ఫొటోలు మార్ఫింగ్ చేసినట్టుగా నేపాల్ ప్రభుత్వ అధికారులు భావించారు. అతడితోపాటు మరో ఇద్దరు అధిరోహకులపై ఆరేళ్ల పాటు నిషేధం విధించారు.
నరేందర్పై విధించిన ఆరేళ్ల నిషేధం ఈ ఏడాది మే 20తో ముగిసింది. వారం రోజుల గ్యాప్ తర్వాత నరేందర్ మళ్లీ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. ఈసారి తన ఘనతను నిరూపించుకోవడానికి అవసరమైన ఫోటోలు, వీడియోలను చూపించాడు. దీంతో నేపాల్ పర్యాటక శాఖ అధికారి.. నరేందర్కు ఎవరెస్ట్ అధిరోహకుడిగా సర్టిఫికెట్ బుధవారం అందించారు.