ఏడాది పాటు సహజీవనం.. పెళ్లి చేసుకుంటానని హామీ.. కుటుంబ సభ్యులను పెళ్లికి ఒప్పిస్తానని చెప్పి వెళ్లి..

ABN , First Publish Date - 2022-01-04T18:14:13+05:30 IST

ఆమె ఓ వ్యక్తితో ప్రేమలో పడింది.. అతనితో ఏడాదిగా సహజీవనం చేస్తోంది..

ఏడాది పాటు సహజీవనం.. పెళ్లి చేసుకుంటానని హామీ.. కుటుంబ సభ్యులను పెళ్లికి ఒప్పిస్తానని చెప్పి వెళ్లి..

ఆమె ఓ వ్యక్తితో ప్రేమలో పడింది.. అతనితో ఏడాదిగా సహజీవనం చేస్తోంది.. పెళ్లి చేసుకుంటానని అతను మాట ఇవ్వడంతో శారీరకంగా కూడా దగ్గరైంది.. ఇద్దరూ భార్యాభర్తల్లాగానే కలిసి జీవించారు.. కుటుంబ సభ్యులతో మాట్లాడి వస్తానని చెప్పి వెళ్లిన అతను తిరిగి రాలేదు.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు.. నేరుగా ఇంటికి వెళ్లిన ఆమెకు షాకిచ్చాడు.. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది..తన ప్రియుడిపై అత్యాచార కేసు పెట్టింది.. హర్యానాలోని హిసార్‌లో ఈ ఘటన జరిగింది. 


హిసార్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాధిత యువతి.. యోగేష్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఇద్దరూ ఏడాది పాటు ఛండీగఢ్‌లో సహజీవనం చేశారు. భార్యాభర్తల్లాగానే కలిసి జీవించారు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అతడికి ఆమె శారీరకంగా కూడా దగ్గరైంది. ఈ ఏడాది పెళ్లి చేసుకుందామని, తన కుటుంబ సభ్యులతో మాట్లాడి వస్తానని చెప్పి యోగేష్ తన ఇంటికి వెళ్లాడు. అయితే ఎన్ని రోజులైనా తిరిగి రాలేదు. దీంతో యోగేష్‌ను వెతుక్కుంటూ ఆమె అతడి ఊరికి వెళ్లింది. 


అక్కడ ఆమెకు యోగేష్ షాకిచ్చాడు. తనకు పెళ్లి కుదిరిందని, ఇక ఎప్పుడూ తనకు ఫోన్ చేయొద్దని తెగేసి చెప్పాడు. దీంతో ఆమె షాకైంది. తనను మోసం చేయ్యొద్దని వేడుకుంది. అయినా యోగేష్ కరగలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి యోగేష్ తనపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2022-01-04T18:14:13+05:30 IST