Gujaratలో కరోనా వైరస్ ఎక్స్‌ఈ వేరియంట్

ABN , First Publish Date - 2022-04-09T16:24:09+05:30 IST

కరోనా వైరస్ ఎక్స్ఈ వేరియంట్ ముంబై నగరం తర్వాత గుజరాత్‌లోనూ శనివారం వెలుగుచూసింది...

Gujaratలో కరోనా వైరస్ ఎక్స్‌ఈ వేరియంట్

అహ్మదాబాద్: కరోనా వైరస్ ఎక్స్ఈ వేరియంట్ ముంబై నగరం తర్వాత గుజరాత్‌లోనూ శనివారం వెలుగుచూసింది.గుజరాత్‌ రాష్ట్రంలో కరోనావైరస్ ఎక్స్ఈ వేరియంట్ ఒక కేసు కనుగొన్నామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. గుజరాత్ రోగికి మార్చి 13వతేదీన కొవిడ్-19 పాజిటివ్ అని తేలిందని, అతను వారం రోజుల్లో కోలుకున్నాడని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌ అధికారులు చెప్పారు. కరోనా సోకిన వ్యక్తికి జీనోమ్-సీక్వెన్సింగ్ తర్వాత ఎక్స్ఈ వేరియంట్ కరోనావైరస్ సోకినట్లు గుర్తించారు. రోగికి ఎక్స్ఈ వేరియంట్ అని నిర్ధారించడానికి నమూనాను మళ్లీ పరిశీలించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ఓమైక్రాన్ బీఏ.2 సబ్-వేరియంట్ కొవిడ్-19 అంటువ్యాధిగా పరిగణిస్తున్నారు. ముంబై ఎక్స్ఈ కేసు పునర్విచారణ ఇంకా పూర్తి కాలేదు.ముంబై రోగి శాంపిల్‌ను పరీక్ష కోసం పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు.


Updated Date - 2022-04-09T16:24:09+05:30 IST