రిసెప్షన్ ముగిశాక పెళ్లి కుమార్తె చేసిన పనేంటో తెలిస్తే..
ABN , First Publish Date - 2021-11-26T18:45:42+05:30 IST
వధూవరులు కుటుంబీకులు పెళ్ళి సంబరంలో ఉత్సా హంగా గడుపుతున్నారు. రాత్రి రిసెప్షన్కు బంధుమిత్రలు పెద్దసంఖ్యలో రాగా అందరికీ విందు ఏర్పాటు చేశారు. ఆతర్వాత ఫోటోషూట్ కూడా ఉత్సాహంగానే
బెంగళూరు: వధూవరులు కుటుంబీకులు పెళ్ళి సంబరంలో ఉత్సా హంగా గడుపుతున్నారు. రాత్రి రిసెప్షన్కు బంధుమిత్రలు పెద్దసంఖ్యలో రాగా అందరికీ విందు ఏర్పాటు చేశారు. ఆతర్వాత ఫోటోషూట్ కూడా ఉత్సాహంగానే సాగింది. ఇక కాసేపు విశ్రాంతి తీసుకుంటేm ముహూర్తంకు సిద్దమవుదామని అందరూ భావిస్తుండగా పెళ్ళి కుమార్తె పరారీ అయినట్లు తేలిపోయింది. దీంతో బెంగళూరు వరుడితో పాటు కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. రామనగర్ జిల్లా చెన్నపట్టణకు చెందిన యువతికి బెంగళూరుకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఇరువురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నారు. మంగళవారం రాత్రి వధువు సొంతూరులోని ఓ కళ్యాణమంటపంలో రిసెప్షన్ వేడక జరిగింది. అర్ధరాత్రి దాటాక వధువు ఎవరికంటా పడకుండా పరారీ అయ్యింది. తెల్లారేసరికి కళ్యాణమంట పంలో విషాధం మిగిలింది. వధువు కుటుంబీకులకు పరాభవం చోటుచేసుకోగా వరుడు కుటుంబీకులు చెన్నపట్టణ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు.