ప్రేమికుల మధ్య గ్రామస్థుల చిచ్చు.. రైలు కింద పడి యువతి ఆత్మహత్య.. ఆ విషయం తెలుసుకున్న ప్రియుడు..

ABN , First Publish Date - 2022-02-25T22:57:02+05:30 IST

ఒకే గ్రామానికి చెందిన వారిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. పెళ్లి చేసుకుందామనుకున్నారు..

ప్రేమికుల మధ్య గ్రామస్థుల చిచ్చు.. రైలు కింద పడి యువతి ఆత్మహత్య.. ఆ విషయం తెలుసుకున్న ప్రియుడు..

ఒకే గ్రామానికి చెందిన వారిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. పెళ్లి చేసుకుందామనుకున్నారు.. ఇద్దరివీ వేర్వేరు కులాలు కావడంతో గొడవ మొదలైంది.. కుటుంబ సభ్యుల కంటే గ్రామస్థుల నుంచి వ్యతిరేకత ఎక్కువైంది.. యువతి మైనర్ కావడం గ్రామస్థులకు కలిసొచ్చింది.. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువతి రైలు కింద పడి చనిపోయింది.. ఆ విషయం తెలుసుకున్న ప్రియుడు కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. 


ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలోని ఫతేగంజ్‌కు చెందిన 18 ఏళ్ల యువకుడు, 16 ఏళ్ల బాలిక రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. ఇద్దరూ వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో గొడవ మొదలైంది. గ్రామంలోని ఇరు కులాలకు చెందిన పెద్దలు ఆ పెళ్లికి అంగీకరించలేదు. బాలిక మైనర్ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరంచారు. తీవ్ర మనస్థాపానికి గురైన యువతి గురువారం రాత్రి రైలు కింద పడి చనిపోయింది. 


విషయం తెలుసుకున్న యువకుడు శుక్రవారం ఉదయం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బాలిక మృతదేహం షాజహాన్‌పూర్ ప్రాంతంలో, యువకుడి మృతదేహం బరేలీ ప్రాంతంలో లభ్యమయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 


Updated Date - 2022-02-25T22:57:02+05:30 IST