రోడ్డు పక్కన పైపు లైన్లు వేస్తున్న కార్మికులు.. పక్కనే బావిలోంచి తీవ్ర దుర్వాసన.. ఏంటా అని వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2021-12-16T22:58:29+05:30 IST

కార్మికులు రోడ్డు పక్కన పైపు లైన్లు వేస్తున్నారు.. వారిలో ఒకరు మూత్ర విసర్జన చేసేందుకు పక్కనే ఉన్న పాడుబడిన బావి దగ్గరకు వెళ్లాడు.

రోడ్డు పక్కన పైపు లైన్లు వేస్తున్న కార్మికులు.. పక్కనే బావిలోంచి తీవ్ర దుర్వాసన.. ఏంటా అని వెళ్లి చూస్తే..

కార్మికులు రోడ్డు పక్కన పైపు లైన్లు వేస్తున్నారు.. వారిలో ఒకరు మూత్ర విసర్జన చేసేందుకు పక్కనే ఉన్న పాడుబడిన బావి దగ్గరకు వెళ్లాడు.. లోపలి నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో ఏంటా అని చూశాడు.. లోపల ఓ యువకుడి మృతదేహం కనిపించింది.. వెంటనే అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు.. శవం పూర్తిగా కుళ్లిపోయింది.. రాజస్థాన్‌లోని బిళ్వారా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


బిళ్వారాకు సమీపంలోని చందేరియా గ్రామంలో కరణ్ సింగ్ అనే వ్యక్తి తోటి కార్మికులతో కలిసి బుధవారం నాడు పైప్ లైన్ పనులు చేస్తున్నాడు. మూత్ర విసర్జన చేసేందుకని పక్కనే ఉన్న పాడుబడిన బావి వద్దకు వెళ్లాడు. బావి లోపలి నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో ఏంటా అని చూశాడు. లోపల ఓ యువకుడి మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. 


మృతదేహాన్ని అతి కష్టం మీద వెలికి తీశారు. పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. పది రోజుల కిందట ఆ వ్యక్తి మరణించి ఉండవచ్చిన పోలీసులు భావిస్తున్నారు. అతని చేతి మీద `కృష్ణ` అని రాసింది. ఆ వ్యక్తి ఎవరనే తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.  

Updated Date - 2021-12-16T22:58:29+05:30 IST