మార్చిలో పెళ్లి.. కొన్నాళ్లకే భర్తపై అనుమానం.. సీక్రెట్‌గా అతడు చెప్పిన ఆఫీసుకు వెళ్లి ఆరా తీసిన కొత్త పెళ్లికూతురికి మైండ్‌బ్లాంక్..!

ABN , First Publish Date - 2021-12-21T21:27:20+05:30 IST

ఆమె పేరు పూనమ్.. బీఎస్సీ చదువుకుంది.. ఈ ఏడాది ఆరంభంలో ఆమెకు ఓ పెళ్లి సంబంధం వచ్చింది..

మార్చిలో పెళ్లి.. కొన్నాళ్లకే భర్తపై అనుమానం.. సీక్రెట్‌గా అతడు చెప్పిన ఆఫీసుకు వెళ్లి ఆరా తీసిన కొత్త పెళ్లికూతురికి మైండ్‌బ్లాంక్..!

ఆమె పేరు పూనమ్.. బీఎస్సీ చదువుకుంది.. ఈ ఏడాది ఆరంభంలో ఆమెకు ఓ పెళ్లి సంబంధం వచ్చింది.. అబ్బాయి ప్రభుత్వోద్యోగి కావడంతో ఆమె ఓకే చెప్పేసింది.. దీంతో ఆమె తల్లిదండ్రులు రూ.30 లక్షలు ఖర్చు పెట్టి ఘనంగా పెళ్లి చేశారు.. పెళ్లి జరిగిన కొన్నాళ్లకే ఆమెకు భర్తపై అనుమానం మొదలైంది.. రహస్యంగా అతడి ఆఫీస్‌కు వెళ్లింది.. అక్కడ అసలు విషయం బయటపడింది.. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి భర్తపై ఛీటింగ్ కేసు పెట్టింది. 


హర్యానాలోని హిసార్‌కు చెందిన పూనమ్‌కు ఈ ఏడాది ఆరంభంలో మోనూ కుమార్ అనే వ్యక్తితో వివాహం కుదిరింది. తాను పంచ్‌కులలోని ఆర్బన్ డెవలప్‌మెంట్ ఆఫీస్‌లో సీనియర్ క్లర్క్‌గా ఉద్యోగం చేస్తున్నానని పెళ్లి చూపుల సమయంలో మోనూ చెప్పడంతో పూనమ్ పెళ్లికి ఓకే చెప్పింది. ఆమె తల్లిదండ్రులు రూ.30 లక్షలు ఖర్చు పెట్టి ఈ ఏడాది మార్చిలో ఘనంగా పెళ్లి చేశారు. అయితే పెళ్లైన కొన్నాళ్లకే మోనూపై పూనమ్‌కు అనుమానం కలిగింది. రహస్యంగా అతడు చెప్పిన ఆఫీస్‌కు వెళ్లి ఎంక్వైరీ చేసింది. 


అక్కడ ఆమెకు షాకింగ్ విషయం తెలిసింది. మోనూ కుమార్‌ అనే పేరుతో అక్కడ ఎవరూ పనిచేయడం లేదని తెలిసింది. భర్త అబద్ధం చెప్పి తనను పెళ్లి చేసుకున్నాడని తెలుసుకుంది. అనంతరం భర్తను నిలదీసింది. ఆగ్రహానికి గురైన మోనూ.. పూనమ్‌ను కొట్టాడు. దీంతో ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్తపై ఛీటింగ్ కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2021-12-21T21:27:20+05:30 IST